Minister Roja Mobile: ఏపీ మంత్రి రోజాకు తిరుపతిలో షాక్‌ తగిలింది. ఆమె సెల్‌ఫోన్‌ మాయమయ్యింది. దాదాపు మూడు గంటల పాటు ఈ పరిణామం హడలెత్తించింది. రోజాతో పాటు.. సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న రోజా.. ఆ తర్వాత పద్మావతి గెస్ట్‌హౌస్‌లో కాసేపు బస చేశారు. అక్కడినుంచి ముందుగా నిర్ధారించుకున్న మేరకు తిరుపతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఎస్వీ యూనివర్సిటీలో శాప్‌ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అక్కడే రోజా తన సెల్‌ఫోన్‌  మిస్‌ అయినట్లు గుర్తించారు. ఆ ప్రాంగణంలోనే ఉంటుందనుకొని వెతికారు. కానీ, ఫలితం లేకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సెల్ ఫోన్ కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ పరిశీలించాయి. దీంతో, రోజా సెల్‌ఫోన్‌ దొరికింది. ఈ సంఘటనలో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అక్కడ పనిచేసే వాచ్‌మెన్‌గా చెబుతున్నారు. 


అయితే, ఈ పరిణామం కొద్దిసేపు కలకలం సృష్టించింది. సాక్షాత్తూ మంత్రి సెల్‌ఫోన్‌ చోరీకి గురవడం తీవ్ర చర్చనీయాంశమయ్యింది. మంత్రి రోజా సెక్యూరిటీ సిబ్బందితో పాటు.. పోలీసులకు చెమటలు పుట్టించింది. అయితే, ఎట్టకేలకు రోజా సెల్‌ఫోన్‌ దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రోజా సెల్‌ఫోన్‌ దొరికిందోచ్‌! అని పోలీసులు రిలాక్సయ్యారు.


Also Read: India Covid Cases: మరోసారి పెరిగిన కరోనా కేసులు.. ఫోర్త్ వేవ్ కు సంకేతమా?


Also Read: Planet Parade 2022: ఆకాశంలో అద్భుతం...ఒకే రేఖపైకి ఐదు గ్రహాలు..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.