ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయింది. రాత్రి నుంచి అంతా ఉత్సాహంగా గడుపుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మాత్రం భిన్న పరిస్థితి నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన మూడు రాజధానుల ప్రకటన ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. అమరావతిలో రైతుల ఆందోళన చేస్తూనే ఉన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న ఒకే ఒక్క డిమాండ్ తో అన్నదాతలు రోడ్డెక్కారు. కొత్త ఏడాది తొలి రోజున కూడా సీఎం జగన్ ప్రకటనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమరావతి రైతులకు అండగా..


మరోవైపు అమరావతి రైతులకు టీడీపీ కూడా మద్దతు కొనసాగిస్తోంది. ఇప్పటికే పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి రైతులతో కలిసి ఆందోళనల్లో పాల్గొన్నారు. తాజాగా నూతన సంవత్సరం రోజున కూడా అమరావతి రైతులతో నిరసన ప్రదర్శనకు దిగారు. ఈసారి ఆయనతోపాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా అమరావతి రైతుల ఆందోళనలో పాల్గొనడం విశేషం. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా.. భర్త నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా..  నారా భువనేశ్వరి ఎప్పుడూ ప్రత్యక్షంగా రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేదు. కానీ ఇప్పుడు ఆమె కూడా ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. అమరావతి రైతులకు అండగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలని రైతులు దాదాపు పక్షం రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..