ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పెట్టుబడులు ఆహ్వానించడానికి మరియు ప్రముఖ వ్యాపార దిగ్గజాలను స్వయంగా కలవడం కోసం మూడు రోజులు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కియా మోటార్స్ కంపెనీతో పలు ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. అలాగే ఆ సంస్థ హెడ్ క్వార్టర్స్‌ను కూడా సందర్శించనున్నారు.


డిసెంబరు 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు ఈ పర్యటన ఉంటుంది. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు యనమల రామక్రిష్ణుడు, ఎన్ అమరనాథరెడ్డి, సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ సాయి ప్రసాద్ తదితరులు కూడా ఈ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఓసీఐ కంపెనీ లిమిటెడ్, యంగ్ వన్, కొరియా ఆటోమొబైల్ మ్యానుఫాక్చర్స్ అసోసియేషన్ సంస్థల అధినేతలతో కూడా ప్రత్యేకంగా భేటీ అవ్వనున్నారు సీఎం.