ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ఒకే వేదికపై ప్రసంగించి తన ఆలోచనలను పంచుకోనున్నారు. హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 15వ వార్షికోత్సవంలో భాగంగా జరిగే ప్రత్యేక చర్చా కార్యక్రమానికి ఈ ఇద్దరు యువనేతలకూ ఆహ్వానం అందడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇద్దరూ మంత్రులయ్యాక, ఒకే అంతర్జాతీయ వేదికపై ప్రసంగించడం ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు. అమెరికాలో జరిగే అతి ప్రముఖమైన భారతీయ చర్చా వేదికైన హార్వర్డ్ కాన్ఫరెన్సులో దాదాపు వెయ్యికి పైగా ప్రతినిధులు హాజరవుతారని అంచనా. ఈ సారి ఈ కాన్ఫరెన్సులో సినీ నటుడు కమల్ హాసన్, కేంద్రమంత్రి సురేష్ ప్రభుతో పాటు పలువురు ప్రముఖ వాణిజ్యవేత్తలు కూడా పాల్గొన్ననున్నట్లు సమాచారం