వరల్డ్ కప్ ఫైనల్లో కివీస్ చేతిలో కోహ్లీ సేన అన్యూహంగా ఓటమి  క్రికెట్ అభిమానులతో సినీ రాజకీయ నేతలకు  తీవ్ర నిరాశను మిగిల్చింది. తాజా ఓటమిపై సినీ రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. టీమిండియా ఓటమిపై ఇప్పటికే ప్రధాని మోడీ, బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ స్పందించారు. కాగా టీమిండియా ఓటమిపై తాజాగా నారా లోకేష్ స్పందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెమీస్ లో కివీస్ జట్టుపై టీమిండియా ఓటమిపై ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ స్పందిస్తూ.... ఈ ఓటమి తనకు ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఓటమి అనంతరం గుండె పగిలినంత పనైందని ఉద్వేగానికి లోనయ్యారు. ఇదే సందర్భంలో ఇది మన రోజు కాదని ..ఓడిపోయామన్నారు. 


సెమీస్ పోరులో జడేజా, ధోనీ పోరాడిన తీరు ఎంత చెప్పినా తక్కువేనని కొనియాడారు. టోర్నీ మొత్తంగా చూస్తే  కోహ్లీసేన పోరాడిన తీరు అభినందనీయం అని నారా లోకేశ్ కొనియాడారు.