కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్ల ఏటిగట్టున ఉన్న పురాతన శివాలయం సమీపంలో ఉన్న పుట్టవద్ద శివపార్వతుల పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. రేపు మహా శివరాత్రి ఉండగా..ఈరోజు లోహాలు బయటపడటంతో స్థానికులు విగ్రహాలకు పూజలు చేసేందుకు భారీగా తరలివస్తున్నారు.


కాగా 'శివరాత్రి' పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని శివాలయాలన్నీ అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ  ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. అలానే జిల్లాలోని మహానంది, కాల్వబుగ్గ, యాగంటి తదితర పుణ్యక్షేత్రాలు శివ నామస్మరణలతో మారుమోగుతున్నాయి. జిల్లా పోలీస్ యంత్రాగం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.