ఎన్నికల్లో నేతల హామీల పర్వం కొనసాగుతోంది. తాజా పవన్ సరికొత్త హామీ ఇచ్చారు. తిరుపతిలో ఈ రోజు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ తమ పార్టీ అధికారంలో వస్తే ఏం చేస్తారో  వివరించారు. తిరుపతిలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తిరుపతిలో అందుబాటులో ఉండి రాయలసీ ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.


అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోగా మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. హెరిటేజ్ సంస్థ కారణంగా మూతపడ్డ డెయిరీలను తెరిపిస్తామన్నారు. విద్యావ్యవస్థన మరింత బలోపేతం చేస్తానని... స్విమ్స్ ను ఎయిమ్స్ లా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా కోసం లిఖిత పూర్వక హామీ ఇచ్చి సంతకం చేసిన వారికే మద్దతు తెలుపుతామన్ని హామీ ఇచ్చారు.