ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, లోక్‌సత్తా, వామపక్షాలు, ఆప్ కలిసి పోటీ చేస్తాయని ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. తమ ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణే అని స్పష్టం చేశారు. పవన్‌కు రాజకీయంగా మంచి పరిణతి ఉందని ఆయన అభినందించారు. ఇక కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం సహకరించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందన్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటనపై రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయనగరంలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్


'జనసేన పోరాట యాత్ర'లో భాగంగా ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌.. సోమవారం యాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఎస్‌ కోటలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి బయల్దేరి ఆయన విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎస్‌ కోట చేరుకుని మధ్యాహ్నం దేవిగుడి జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు.అనంతరం పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు.