తిత్లీ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లా వాసులు తీవ్రంగా నష్టపోయినా... పవన్ కల్యాణ్ మాత్రం ఏమీ పట్టించుకోలేదని, రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిందిగా కోరుతూ ప్రధానికి కనీసం ఓ లేఖ కూడా రాయని పవన్ కల్యాణ్‌కు తనని విమర్శించే హక్కు లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తిత్లీ తుఫాను మిగిల్చిన విషాదం గురించి వివరిస్తూ కేంద్రానికి లేఖ కూడా రాయలేదని చంద్రబాబు చేసిన ఆరోపణలను ఖండిస్తూ పవన్ కల్యాణ్ ఓ ట్వీట్ చేశారు. తిత్లీ తుఫాను కారణంగా జరిగిన నష్టాన్ని వివరిస్తూ, రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిందిగా తాను కేంద్రానికి లేఖ రాశానని.. అందుకు ఇదే సాక్ష్యం అంటూ తాను రాసిన లేఖను పవన్ ఆ ట్వీట్‌తో జతపరిచారు.