పోలవరం ప్రాజెక్టును డిజైన్ ప్రకారమే నిర్మిస్తున్నామని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘుపతి స్పష్టం చేశారు. పోలవరం పనుల్ని పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్( Andhra pradesh ) ప్రజల జీవనరేఖ ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు ( Polavaram project ) పనుల్ని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పరిశీలించారు. అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. పోలవరం పనులు డిజైన్ ప్రకారమే జరుగుతున్నాయని..ఒక్క అంగుళం కూడా ఎత్తు తగ్గించేది లేదని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ప్రారంభించిన ఘనత కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( Ys Rajasekhar reddy ) కే దక్కుతుందని చెప్పారు. 


నాడు ముందుచూపుతో కాలువ పనులు చేయించడం వల్లనే పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. ప్రాజెక్టు లేకుండా కాలువలు తవ్వుతున్నారని నాడు ఎద్దేవా చేశారని..ఇప్పుడు అవే కాలువుల ద్వారా నీళ్లు మళ్లిస్తున్నారని గుర్తు చేశారు. నాడే భూ సేకరణ చేయడం వల్ల ఇవాళ ఖర్చు తగ్గిందని చెప్పారు.  


Also read: AP: నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ ప్రభుత్వం..అమ్మ ఒడి పరిస్థితేంటి ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook