Youth held for posting girls obscene photos: ప్రకాశం జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఓ ఇంటర్ విద్యార్థినికి కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చిన యువకుడు... ఆపై ఆమె నగ్న చిత్రాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. అనంతరం వాటిని మరో స్నేహితుడికి పంపించాడు. సదరు స్నేహితుడు వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. బాలిక తల్లిదండ్రులు దీనిపై పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే... ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలానికి చెందిన నాగూర్ మీరావలి (19) అనే యువకుడు డిప్లోమా చదువుతున్నాడు. ఇటీవల మార్కాపురంలో అతనికి తెలిసిన ఇంటర్ విద్యార్థిని ఎదురైంది. స్నేహితురాలి పుట్టినరోజు వేడుకల కోసం ఆమె మార్కాపురం వచ్చినట్లు చెప్పింది. ఆమెతో మాటలు కలిపిన మీరావలి... కూల్‌ డ్రింక్ తాగుదామని తీసుకెళ్లాడు.


కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇవ్వడంతో ఆ బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అనంతరం ఆ యువకుడు ఆమెను వివస్త్రగా మార్చి తన సెల్‌ఫోన్‌లో నగ్న చిత్రాలు చిత్రీకరించాడు. ఆ ఫోటోలను తన స్నేహితుడు రసూల్ (22)కి పంపించడంతో.. అతను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. దీంతో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. బాలిక తల్లిదండ్రులకు విషయం తెలియడంతో ఆమెను వెంటపెట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. 


Also Read: Petrol Price: అక్కడ కేవలం ఒక్క రూపాయికే లీటర్ పెట్రోల్... గుంపులుగా ఎగబడ్డ జనం...


Also Read: Horoscope Today April 15 2022: రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook