అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థికి దొరకనంత వేగంతో భారీ మెజారిటీతో ముందంజలో దూసుకుపోతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో అభినందనలు తెలిపారు.


అలాగే ఒడిశా ముఖ్యమంత్రి, బిజు జనతా దళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ సైతం భారీ ఆధిక్యంలో ముందంజలో దూసుకుపోతుండటంతో ప్రధాని మోదీ ఒడియాలో ఆయనకు అభినందనలు చెప్పారు.