అమరావతి : ఏపీకి ప్రత్యేక హోదా ఓ బోరింగ్ సబ్జెక్ట్ అని ప్రముఖ సినీ నిర్మాత, వైఎస్సార్సీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపి) వ్యాఖ్యానించారని టీడీపీ నేతలు చేస్తోన్న ఆరోపణలపై పీవీపి స్పందించారు. విజయవాడ లోక్ సభ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేస్తోన్న పీవీపీ తాజాగా ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఓ బోరింగ్ సబ్జెక్ట్ అని తాను చెప్పలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని తేల్చిచెప్పారు. హోదాపై మొదటి నుంచీ వైఎస్సార్సీపీకి ఎంత చిత్తశుద్ధి ఉందో ప్రజలకు అందరికీ తెలుసని అన్నారు. అలాగే తానంటే ఏమిటో కూడా బెజవాడ ప్రజలకు తెలుసునని, తెలుగు దేశం పార్టీ నేతల మైండ్ గేమ్‌కి తాము లొంగపోబోమని పీవీపి పేర్కొన్నారు. 


ఈ సందర్భంగా టీడీపి తీరుపై పీవీపీ పలు విమర్శలు చేశారు. తాతలు ఇచ్చిన ఆస్తులు కాకుండా ప్రజలకు సొంతంగా మీరేం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.