AP Corona Update: మహమ్మారి వైరస్‌ ఆంధ్రప్రదేశ్‌లో నియంత్రణలోకి వస్తోంది. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కట్టడి చర్యలు కఠినంగా అమలవుతున్నాయి. మరోవైపు రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి (Corona pandemic) నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.పెద్దఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తూనే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. గత 24 గంటల్లో ఏపీలో 93 వేల 511 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..8 వేల 766 మందికి పాజిటివ్‌గా తేలింది. పరీక్షలతో పోలిస్తే ఇటీవలి కాలంలో ఇది చాలా తగ్గుదలగా ఉంది. గత 24 గంటల్లో 12 వేల 292 మంది కోలుకున్నారు. అటు కరోనా కారణంగా మరణించివారి సంఖ్య గత 24 గంటల్లో 67 ఉంటే..ఇప్పటి వరకూ 11 వేల 696 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1 లక్షా 3 వేల యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ రికార్డు స్థాయిలో 2 కోట్ల 39 వేల 764 కరోనా నిర్దారణ పరీక్షలు (Covid19 Tests) చేశారు. 


ఇక రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ప్రస్తుతం 9.3 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1.09 కోట్ల మందికి వ్యాక్సిన్(Vaccination) ఇచ్చారు. జూలై 10 వతేదీ నాటికి ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సిన్ మొదటి డోసు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమౌతోంది. 


Also read: YSR Bima Scheme: వైఎస్ఆర్ బీమా పథకంలో కీలక మార్పులు, జూలై 1 నుంచి అమలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook