AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న పగడ్బందీ చర్యల ఫలితంగా కరోనా ఉధృతి తగ్గుతోంది. మరోవైపు పెద్దఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు మాత్రం కొనసాగిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలోని వివిధ ప్రాంతాల్లో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ఉధృతి తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా ఏపీలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రోజుకు 18 గంటలపాటు అమలు చేస్తున్న కర్ఫ్యూ, భారీగా నిర్వహిస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షల కారణంగా కరోనా సంక్రమణ తగ్గుతోంది. గత కొద్దిరోజులుగా ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్యలో తగ్గుదల కన్పిస్తోంది. గత 24 గంటల్లో 97 వేల 863 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..కేవలం 8 వేల 110 మందికి పాజిటివ్ గా నిర్ధారణైంది. మరోవైపు 67 మంది మరణించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 11 వేల 763కు చేరుకుంది. గత 24 గంటల్లో 12 వేల 981 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 99 వేల 57 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.


రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2 కోట్ల 1 లక్షా 37 వేల 627 కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) జరిగాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1980 కేసులు, చిత్తూరులో 974, పశ్చిమ గోదావరి జిల్లాలో 837, అనంతపురంలో 960 నమోదయ్యాయి.


Also read: Ys Jagan Delhi Tour: వైఎస్ జగన్ రెండ్రోజులు ఢిల్లీలో బిజీ, పర్యటన వివరాలివీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook