Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. రోజురోజుకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తున్నాయి. నైరుతి గాలుల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా కింది స్థాయి గాలులు నైరుతి దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మూడు రోజులపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ, రేపు తెలంగాణవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతు పవనాలు బలపడుతున్నాయి. ఏపీ, యానాం పరిసరాల్లో నైరుతి గాలులు వీస్తున్నాయి. దీనికితోడు ఉపరితల ద్రోణి కేంద్రీకృతమైంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో రాగల మూడు రోజులపాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.


ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని..వీటితోపాటు ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది. రాయలసీమలోనూ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల్లో మరికొన్ని చోట్ల జోరుగా వానలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇటు దేశవ్యాప్తంగా నైరుతి గాలులు బలంగా వీస్తున్నాయి. దీంతో ఉత్తర, దక్షిణ భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురుస్తుండటంతో రైతులంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు.


Also read: AP Govt: సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..పే స్కేల్‌ ఫిక్స్ చేసిన ప్రభుత్వం..!


Also read:Rashmika Mandanna Responds : కుక్కకి టికెట్ల వార్తపై రష్మిక స్పందన ]



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.