Southwest Monsoon: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతు పవనాలు వేగంగా కదులుతున్నాయి. దీంతో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. పగటి పూట వాతావరణం సాధారణంగా ఉన్నా..రాత్రి వేళల్లో మాత్రం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇటీవల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర ఇంటీరియల్ కర్ణాటక నుంచి ఇంటీరయర్ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కేంద్రీకృతమైంది. సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ద్రోణి వ్యాపించి ఉంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడకక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.


నైరుతి రుతుపవనాలు, ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల మూడురోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడకక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు సైతం వీచే అకాశం కనిపిస్తోంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు ఉండనున్నాయి.



Also read:Agnipath Riots: అగ్నిపథ్‌ అల్లర్ల మాస్టర్ మైండ్ ఏపీలో అరెస్ట్?


Also read: Rajnath Singh Review on Agnipath: దేశంలో చల్లారని అగ్నిపథ్‌ మంటలు..రాజ్‌నాథ్‌సింగ్ కీలక రివ్యూ..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook