ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై గురువారం ఉదయం చోటుచేసుకుంది.  ఏపీలో ఆర్టీసీ బస్సులు రైట్ రైట్.. కండక్టర్ లేకుండానే! 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసుల కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన గిరిశాల శ్రీనివాస్, భార్య లక్ష్మీ సహా మరికొందరు కుటుంబసభ్యులతో హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు చిట్యాల మండలం వట్టిమర్తి శివారులోని హైవేపై ఆగి ఉన్న ధాన్యం లారీని వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టింది. Photos: 36-24-36తో సెగలు రేపుతోన్న అందం


ఈ ప్రమాదంలో గిరిశాల శ్రీనివాస్, భార్య గీత లక్ష్మీ, లక్ష్మీ చందన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిని నార్కట్‌పల్లిలోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు. ముగ్గురు చిన్నారులు సహా మొత్తం 8 మంది కారులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. నల్గొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్