కర్నూలు: కరోనావైరస్ కర్నూలు జిల్లాను వణికిస్తోంది. అత్యధిక సంఖ్యలో నమోదవుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులతో కర్నూలు జిల్లా (COVID-19 cases in Kurnool dist) మరో వుహాన్‌ని తలపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం కర్నూలు జిల్లాలో కొత్తగా మరో 25 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 436కి చేరిందని జిల్లా వైద్యాధికారి డా రామ గిద్దయ్య తెలిపారు. జిల్లాలో 11,325 మందికి కరోనా పరీక్షలు చేయగా.. మొత్తం 436 మందికి పాజిటివ్ వచ్చింది. వీళ్లలో ఇప్పటివరకు 64 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. మరో 9 మంది చనిపోయారని డా రామ గిద్దయ్య పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో 360 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: ఒకే బిల్డింగ్‌లో 41 మందికి కరోనావైరస్


వీళ్లే కాకుండా జిల్లాలో మొత్తంగా మరో 1,559 మందిని క్వారంటైన్ చేసి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం మరో 317 మంది వివిధ క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు. కర్నూలు జిల్లాలో 7 రెడ్ జోన్స్ (Red zones in Kurnool dist) ఉండగా మరో 21 ఆరెంజ్ జోన్స్ ( Orange zones in Kurnool dist) ఉన్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..