Two buildings collapse in AP: అనంతపురం జిల్లా(Anantapur district) కదిరిలో విషాదం చోటు చేసుకుంది. రెండు భవనాలు కూలిపోయిన (Two buildings collapse in ap) ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి చెందారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే...
కదరి(Kadiri)లోని పాత ఛైర్మన్ వీధిలో రెండు భవనాలు కూలిపోయాయి. మొదట రెండంతస్తుల భవనం.. మరో భవనంపై పడడంతో.. రెండు ఇళ్లు  నేలమట్టమయ్యాయి. ఒక ఇంట్లో 8 మంది ఉండగా... మరో ఇంట్లో ఏడుగురు ఉన్నారు. మొత్తం 15 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.


Also Read: అనంతపురం జిల్లా అతలాకుతలం.. చిత్రావతి నదిలో చిక్కుకున్న 8 మంది


ఘటనస్థలానికి  చేరుకున్న అధికారులు జేసీబీల సహాయంతో శిథిలాలను తొలగించి ఆరుగురిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భారీ వర్షాల(Heavy Rains) కారణంగా భవనాలు కూలినట్లు తెలుస్తోంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook