AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి శాంతిస్తోంది. కరోనా సంక్రమణ గత కొద్దిరోజులుగా తగ్గుతుండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది. కరోనా కేసులు తగ్గుతున్నా...కరోనా నిర్ధారణ పరీక్షల్ని మాత్రం పెంచుతోంది ప్రభుత్వం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్( Corona Second Wave)ఉధృతి రాష్ట్రంలో గణనీయంగా తగ్గుతోంది. పాజిటివిటీ రేటు భారీగా తగ్గడం మంచి పరిణామంగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కట్టుదిట్టమైన చర్యల ఫలితంగా రాష్ట్రంలో కరోనా నియంత్రణ సాధ్యమైంది. ఓ వైపు మెగా వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమాలు, మరోవైపు పెద్దఎత్తున నిర్వహిస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షలు కరోనా వైరస్(Corona virus)నియంత్రణకు దోహదపడుతున్నాయి. 


గత 24 గంటల్లో ఏపీలో 80 వేల 712 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా...4 వేల 684 మందికి పాజిటివ్‌గా తేలింది. అటు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18 లక్షల 62 వేలకు చేరుకుంది. గత 24 గంటల్లో 7 వేల 324 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 17 లక్షల 98 వేల 380 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2 కోట్ల 13 లక్షల 61 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు( Covid19 Tests)చేశారు. గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1171 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 660 కేసులు, చిత్తూరులో 493 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఏపీలో ఇప్పటి వరకూ 12 వేల 452 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 51 వేల 204 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.


Also read: Ys jagan on Chiru Tweet: మెగాస్టార్ చిరంజీవికు..వైఎస్ జగన్ కృతజ్ఞతలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook