వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ఈ రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ పెళ్లి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి వర్గీయులకు, స్థానిక టీడీపీ పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చెలరేగడంతో కాస్త ఉద్రిక్తకరమైన వాతావరణం నెలకొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే పోలీసులు వచ్చి పరిస్థితిని సరిదిద్దడానికి ప్రయత్నించినా సరే సమస్య కొలిక్కి రాలేదు. పార్టీ శ్రేణుల్లో కొందరు వ్యక్తులు రాళ్లదాడికి కూడా పాల్పడడంతో అయోమయకరమైన పరిస్థితి ఏర్పడింది.


ఈ క్రమంలో తమపై దాడికి ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు యత్నించారని చెబుతూ తమ నిరసనను కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. అయితే వారిని పోలీసులు అరెస్టు చేసి అక్కడ నుండి తీసుకెళ్లిపోయారు. వాతావరణం మరింత వేడెక్కకుండా ఉండేందుకే వైఎస్సార్సీపీ నేత అవినాష్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారని తెలుస్తోంది.