కడప: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల అసెంబ్లీ అభ్యర్ధిగా బరిలోకి దిగితున్న ఆయన స్థానికి తహసీల్దార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.  జగన్‌ వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరావడంతో పులివెందుల తహసీల్దార్ ప్రాంగణం జనసంద్రమైంది. అనంతకుముందు  జగన్‌ సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం నామినేషన్‌ వేసేందుకు తహసీల్దార్ కార్యాలయానికి బయలుదేరారు