Ys jagan mass ragging to Chandrababu naidu video goes viral: మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు(శుక్రవారం) ఏపీలో వరద సంభవించిన పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబును మాస్ ర్యాగింగ్ చేశారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను ఎంతవరకు అమలు చేశారని కూడా మండిపడ్డారు. ప్రజల్నిపూర్తిగా అమలుకు సాధ్యంకానీ హమీలు ఇచ్చి మోసం చేశారని కూడా వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో.. పిఠాపురంలోని ఏలేరు వరద సంభవించిన పలు ప్రాంతాల్ని వైఎస్ జగన్ పరిశీలించారు. అక్కడి ముంపు ప్రాంత బాధితులతో మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 ఏపీ ప్రజలను కూటమి అమలుకు సాధ్యంకానీ హమీలు ఇచ్చి మోసం చేసిందని కూడా మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. అంతే కాకుండా.. ఏపీలో ప్రస్తుతం విజయవాడ, ఏలేరుకు వరదలు రావడానికి చంద్రబాబు సర్కారు నెగ్లీజెన్సీ కారణమని జగన్ విమర్శించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్.. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలను ఇమిటెట్ చేస్తు ర్యాగింగ్ చేశారు.ఈ వీడియో  ప్రస్తుతం వైరల్గా మారింది.


పూర్తి వివరాలు..



ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అంతేకాకుండా.. భారీ మెజార్టీ ఇచ్చి మరీ ఆశీర్వదించారు. మరోవైపు వైనాట్ 175 అన్న జగన్ కు మాత్రం.. ఏపీ ప్రజలు షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో  తాజగా, మాజీ సీఎం వైఎస్ జగన్.. ఎన్నికలలో అమలుకు సాధ్యంకానీ హమీలు ఇచ్చికూటమి మోసం చేసిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


అంతేకాకుండా..చంద్రబాబు  ఎన్నికల ప్రచారంలో.. ఏపీ ప్రజలకు ఇచ్చిన హమీలను వైఎస్ జగన్ ఇమిటేట్ చేసి మరీచూపించారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో.. కూటమి అధికారంలోకి వస్తే. రైతన్నలకు 20 వేలుఇస్తామని చెప్పారు. అదే విధంగా జగన్ కేవలం.. 13 వేలు మాత్రం ఇస్తున్నాడని విమర్శించేవారు. అదే విధంగా.. ఇంటిల్లి పాదిపిల్లలకు ఎవరు కన్పించిన కూడా.. రూ. 15 వేలు ఇస్తామని కూడా తప్పుదోవ పట్టించారని అన్నారు.


Read more: Junior NTR: చంద్రబాబుతో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్.. మరోసారి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..


ఇలా ఏ చిన్న పిల్లవాడు.. కన్పించిన కూడా.. రూ. 15 వేలు ఇస్తామని మిస్ గైడ్ చేశారని కూడా మాజీ సీఎం వైఎస్ జగన్ ర్యాగింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇదిలా ఉండగా.. వైఎస్ జగన్ తాజాగా, ఏలేరు వరద ప్రభావితప్రాంతాలను సందర్శించారు. ఆగస్టు 31నే.. భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అలర్ట్ చేసిందన్నారు. కానీ చంద్రబాబు సర్కారు పట్టించుకోక పోవడం వల్లే ... ఏపీకి ఈ భారీ నష్టం వాటిల్లిందన్నారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.