కరోనా మహమ్మారి రాజకీయ నాయకులను వెంటాడుతోంది. అన్ని రంగాల ప్రముఖులు, సామాన్యులతో పాటు ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో మరో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే (Chirla Jaggireddy) కరోనా బారిన పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కరోనా బారిన (Chirla Jaggireddy Tests Positive For COVID) పడ్డారు. లక్షణాలు కనిపించడంతో కోవిడ్19 టెస్టులు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. అయితే కంగారుపడాల్సిందేమీ లేదని స్వల్ప కరోనా లక్షణాలున్నాయని వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. Genelia: నాకూ కరోనా సోకింది.. 
Meera Mitun Hot Stills: నటి మీరా మిథున్ ఫొటోలు ట్రెండింగ్


గత వారం రోజులుగా తనను కలిసిన వారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సూచించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని వైద్యుల సలహాలు, జాగ్రత్తలు పాటిస్తున్నట్లు తెలిపారు. నెగటివ్‌గా తేలేంత వరకు తనను కలవడానికి ఎవరూ రావొద్దని కోరారు.  Samantha Pregnant: అప్పుడే గర్భవతి అయ్యాను.. కానీ: సమంత 
Kieron Pollard: భీకర ఫామ్‌తో ఐపీఎల్‌కు పోలార్డ్