YSRCP MP Vijayasai Reddy about Anandaiah mandu: విశాఖపట్నం: ఆనంద‌య్య మందుపై వైఎస్సార్సీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి స్పందించారు. కరోనాకు ఆయుర్వేద చికిత్సలో భాగంగా కృష్ణపట్నంలో ఆనందయ్య పంపిణీ చేస్తున్న ఆయుర్వేద ఔషదంతో ఎలాంటి ఇబ్బంది లేదని విజయసాయి రెడ్డి స్పష్టంచేశారు. విశాఖ జిల్లాలో (Anandaiah mandu in Visakhapatnam) అంద‌రికీ క్రమక్ర‌మంగా మందులు అందిస్తామ‌ని చెప్పిన ఎంపీ విజ‌యసాయిరెడ్డి.. కరోనా వ్యాపిస్తున్న ఈ  క్లిష్ట సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ఆనందయ్య మందును బహుమతిగా అందించారు. ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ఆనందయ్య మందు పంపిణీ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : AP COVID-19 updates: ఏపీ కరోనా హెల్త్ బులెటిన్ అప్‌డేట్స్


ఈ సంద‌ర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. కరోనా సమయంలో విశాఖలో 22 వేలకుపైగా మంది ఫ్రంట్‌లైన్ వర్కర్స్ తమ ప్రాణాలకు తెగించి మరీ సేవలు అందించారని ప్రశంసించారు. అందుకే మొదటి దశలో వారికి ఆనందయ్య మందు (Anandaiah ayurvedic medicine) పంపిణీ చేస్తున్నాం అని విజయసాయి రెడ్డి అన్నారు. 


Also read : Anandayya mandu: ఆనందయ్య మందు వాడాను.. కరోనా రాలేదు: Jagapathi Babu


రెండో విడ‌త‌ పంపిణీలో భాగంగా జిల్లాలో ఉన్న ప్రజలు అందరికీ ఆనందయ్య మందు (Anandaiah mandu) అందిస్తాం అని ఎంపీ విజయ సాయి రెడ్డి భరోసా ఇచ్చారు. ఆనందయ్య ఆయుర్వేద ఔషధాల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని తేలింద‌నే విషయాన్ని విజయసాయి రెడ్డి (YSRCP MP Vijayasai Reddy) గుర్తుచేసుకున్నారు.


Also read: Anandaiah Medicine: ఆనందయ్యకు సహకరించేందుకు కార్యాచరణ సిద్ధం : ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook