Banking Alert: బ్యాంకింగ్ కస్టమర్లకు అలర్ట్​. మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరం (New Year 2022) రానుంది. కొత్త సంవత్సరం (2022 జనవరి 1) నుంచి బ్యాంకింగ్ రూల్స్​లో మార్పులు రానున్నాయి. ముఖ్యంగా ఏటీఎం విత్​డ్రా ఛార్జీల్లో మార్పులు (ATM Charges Chaged) చోటు చేసుకోనున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్యాంకింగ్ వినియోగదారులకు ప్రస్తుతం ఏటీఎం ఛార్జీలు పరిమితి దాటిన తర్వాత.. ప్రతి లావాదేవీకి రూ.20 ఛార్జీగా వసూలు చేస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ ఛార్జీలు రూ.21కి (New ATM Charges) పెరగనున్నాయి. దీనికి జీఎస్​టీ అదనం.


ఏటీఎం ఛార్జీలు పెంచేందుకు ఆర్​బీఐ ఇప్పటికే అనుమతులు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు బ్యాంకులు తమ ఖాతాదారులకు కొత్త ఛార్జీల గురించి సమాచారమివ్వడం ప్రారంభించాయి.


కొత్త రూల్స్ వివరాలు ఇలా..


ఏదైన బ్యాంక్​ వినియోగదారుడు.. అదే బ్యాంక్ ఏటీఎంలో 5 సార్లు ఉచితంగా లావాదేవీలు (New Banking Rules) జరపొచ్చు. ఇతర బ్యాంక్ ఏటీఎంలలో అయితే మూడు  సార్లు (మెట్రో నగరాల్లో), 5 సార్లు (నాన్​ మెట్రో పట్టణాల్లో) పరిమితి.


బ్యాంక్ విధించిన ఈ పరిమితి దాటి.. తర్వాత చేసే ప్రతి లావాదేవీకి రూ.21 (జీఎస్​టీ అదనం) ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.


ఏటీఎం లావాదేవీ నగదుతో కూడినదైన లేదా బ్యాలెన్స్ చెక్​, మిని స్టేట్​మెంట్​ కోసం అయినా.. పరిమితి మాత్రం ఐదు సార్లే.


దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ రూల్స్​ను అమలు చేయనున్నాయి.
కొత్త రూల్స్ నేపథ్యంలో తమ వినియోగదారులు.. చేసే ఏటీఎం లావాదేవీలపై ఎప్పటికప్పుడు అలర్ట్ మెసేజ్​ పంపనున్నాయి బ్యాంకులు. ముఖ్యంగా ఉచిత లావాదేవీ పరిమితి దాటిన తర్వాత.. ఛార్జీల వసూలు గురించి సమాచారం ఇచ్చే వీలుంది.


Also read: New year offers on iPhones: యాపిల్ వాచెస్, మ్యాక్‌బుక్స్, ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు, డిసెంబర్ 31 వరకే


Also read: Todays Gold Rate: దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి ​Twitter , Facebook