దేశ ప్రజలకు శుభవార్త. పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో తగ్గనున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరల తగ్గడం వల్ల ఇంధన ధరలు తగ్గనున్నాయని తెలుస్తోంది. పెట్రోల్, డిజిల్ లీటరుకు ఏకంగా 14 రూపాయలవరకూ తగ్గవచ్చని సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డిజిల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఇటీవలి కాలంలో అంటే కరోనా సంక్షోభ సమయం నుంచి ఇంధన ధరలు అమాంతం పెరిగిపోయాయి. గత రెండేళ్ల నుంచి పెట్రోల్-డీజిల్ లీటర్‌కు 40 రూపాయల వరకూ పెరిగిపోయింది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ నుంచి వస్తున్న సమాచారం మేరకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గవచ్చని తెలుస్తోంది. కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు దారుణంగా పడిపోవడమే. ఈ ఏడాది జనవరి నుంచి క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు మరోసారి తగ్గింది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ 81 డాలర్ల నుంచి 74 డాలర్లకు తగ్గింది.


క్రూడ్ ఆయిల్ ధరలు అంతకంతకూ తగ్గుతుండటమే కాకుండా..ఇండియన్ బాస్కెట్ యావరేజ్ ధర బ్యారెల్‌కు 82 డాలర్లకు చేరుకుంది. మార్చ్ నెలలో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ 112.8 డాలర్లు ఉంటే..8 నెలల్లో రిఫైనరీ ఆయిల్ కంపెనీలకు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ రేటు 31 డాలర్లు తగ్గిపోయింది. ఫలితంగా త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 14 రూపాయల వరకూ తగ్గవచ్చు. అయితే ఈ తగ్గింపు ఒకేసారి తగ్గకపోవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.


Also read: Richest Cities: దేశంలోని పది ధనిక నగరాల జాబితా, పదవ స్థానంలో విశాఖపట్నం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook