Gold and Silver Price Today 19 October 2022: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు మార్పులు చోటుచేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఓ రోజు పసిడి ధర పెరిగితే మరోరోజు తగ్గుతుంది.. ఇంకో రోజు మాత్రం స్థిరంగా ఉంటుంది. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో పసిడి నిల్వ, డాలర్ విలువ, పలు దేశాల భౌతిక పరిస్థితులు లాంటి పరిణామాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయి. అయితే పసిడికి భారత మహిళలు అధిక ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి.. బంగారం ధరలు ఎంత పెరిగినా లేదా తగ్గినా వ్యాపారాలు జోరుగానే ఉంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్నటి వరకు పెరుగుతూ వచ్చిన బంగారం ధర.. నేడు స్వల్పంగా దిగి తగ్గింది. బుధవారం (అక్టోబర్ 19) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 46,420గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,640లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 40.. 24 క్యారెట్ల ధరపై రూ. 40 దిగి వచ్చింది. దేశంలోని ప్రధాన పట్టణాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. 


# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,570 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,790గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 46,420 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,640గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,050గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,310 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,470గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,710గా ఉంది. 
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,420 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,640గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,420 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,640గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,420.. 24 క్యారెట్ల ధర రూ. 50,640గా నమోదైంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 46,420 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,640 వద్ద కొనసాగుతోంది. 


నేడు బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి మాత్రం భారీగా తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 56,600లుగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే వెండి ధర ఏకంగా రూ. 3,900 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 56,600లుగా ఉండగా.. చెన్నైలో రూ. 61,800లుగా ఉంది. బెంగళూరులో రూ. 56,600గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 61,800లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 61,800ల వద్ద కొనసాగుతోంది. 


Also Read: T20 World Cup 2022: పాకిస్తాన్‌ను ఓడిస్తే.. భారత్‌దే టీ20 ప్రపంచకప్‌: సురేశ్‌ రైనా


Also Read: Kisan Vikas Patra: జీరో రిస్క్, రెట్టింపు రిటర్న్స్ ఇచ్చే పోస్టాఫీసు పథకమిదే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook