Gold Price Today 25th December 2020: ఈ నెలలో బులియన్ మార్కెట్‌లో భారీగా పెరిగిన బంగారం ధరలు ఇటీవల దిగొచ్చాయి. తాజా మరోసారి బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ముఖ్యంగా లాక్‌డౌన్ నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పుంజుకోగా, దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యకేంద్రాలైన విజయవాడ, విశాఖపట్నం‌, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.110 మేర పెరగడంతో 10 గ్రాముల పసిడి ధర రూ.50,940 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.100 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.46,700కి చేరింది


Also Read: Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana: రూ.330 చెల్లిస్తే.. రూ.2 లక్షల కవరేజీ, స్కీమ్ పూర్తి వివరాలివే  

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌‌లో బంగారం ధరలు (Gold Price Today) ఇటీవల దిగొస్తున్నాయి. ఢిల్లీలో తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. దీంతో 10 గ్రాముల బంగారం ధర నిన్నటిలాగే రూ.53,190 వద్ద మార్కెట్ అవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై ధరలో సైతం ఏ మార్పు లేదు. ఢిల్లీలో నేడు 10 గ్రాముల ధర రూ.48,760 వద్ద స్థిరంగా ఉంది.


Also Read: Amazon Fab Phones Fest: స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్ బంపర్ ఆఫర్లు ఇవే.. 

బులియన్ మార్కెట్‌లో డిసెంబర్‌ తొలి అర్ధభాగంలో భారీగా పెరిగిన వెండి ధరలు తాజాగా దిగొస్తున్నాయి. అయితే ఢిల్లీ మార్కెట్‌లో వరుసగా మూడో రోజు వెండి ధర తగ్గింది. తాజాగా రూ.300 మేర తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.66,600 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.71 వేల మార్కు చేరుకుంది. తాజాగా రూ.900 మేర పెరగడంతో ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.71,400కి ఎగసింది.


Also Read: BSNL Cheapest Plan: తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్.. Airtel, Jio మరియు VIలకు షాక్!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook