Petrol Price Today: ఇంధన ధరలు నానాటికి పెరిగిపోతున్నాయి. గడిచిన 15 రోజుల్లో 13వ సారి ఇంధన ధరలను రూ. 9.20 మేర పెరిగాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ పై లీటర్ కు 80 పైసలు పెంచినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.61కు చేరుకోగా.. లీటర్ డీజిల్ ధర రూ. 95.87గా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ పై 84 పైసల పెంపుతో రూ. 119.67కు చేరుకుంది. డీజిల్ పై మరో 85 పైసల వడ్డనతో లీటర్ రూ. 103.92కు విక్రయిస్తున్నారు. 


తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..


తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​పై 91 పైసలు పెంపుతో.. పెట్రోల్ ధర రూ. 118.57కు చేరింది. డీజిల్ పై మరో 87 పైసల భారంతో రూ. 104.62కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ ధర రూ. 120పైకి చేరుకుంది. పెట్రోల్ పై 88 పైసల పెంపుతో రూ. 120.39కు చేరగా.. డీజిల్ ధర రూ. 106.04గా ఉంది. 


Also Read: HDFC Merger News: హెచ్‌డీఎఫ్‌సీ సంస్థల కీలక నిర్ణయం.. భారీగా పెరిగిన షేర్ వాల్యూ!


Also Read: Petrol Diesel Price Hike: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈసారి ఎంత పెరిగిందంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook