Petrol Price Today In Hyderabad 10 February 2021: భారత్‌లో చమురు ధరలు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ మొదలైన సమయం నుంచి వాహనదారుల జేబులు గుల్ల అవుతున్నాయి. తాజాగా ఫిబ్రవరి 10 (బుధవారం) నాడు లీటర్‌ పెట్రోల్‌ ధర 31 పైసలు, డీజిల్ ధర 27 పెసలు చొప్పున పెరిగింది. తాజాగా పెరిగిన ధరలతో బుధవారం నాడు ఆల్‌టైమ్ కొత్త గరిష్ఠానికి పెట్రోలు, డీజిల్ ధరలు చేరుకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ప్రకారం.. హైదరాబాద్‌(hyderabad)లో బుధవారం ఉదయం పెట్రోల్ ధర లీటర్‌కు రూ.91.09, డీజిల్ ధర రూ.84.79కు చేరుకున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అమరావతిలో పెట్రోల్ ధర రూ.93.79, డీజిల్ ధర లీటర్‌పై రూ.86.99 అయింది.


Also Read: 7th Pay Commission: తెరపైకి కొత్త వేతన కోడ్, PFతో పాటు ఉద్యోగుల జీతాల్లో మార్పులు


ఇండియన్‌ ఆయిల్‌ నిర్ణయించిన తాజా ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.76.30, డీజిల్ ధర రూ.77.48కు పెరిగింది. పెట్రోల్ ధరలు చెన్నైలో రూ.89.70, కోల్‌కతాలో రూ.88.63, ముంబైలో గరిష్టంగా రూ.93.83కి చేరింది.


ఇక డీజిల్‌ ధర లీటర్‌పై ఢిల్లీ(Fuel Prices In Delhi)లో రూ.77.48కు చేరగా, హైదరాబాద్‌లో రూ.83.46 అయింది. ముంబైలో రూ.84.79, చెన్నైలో రూ.82.66, కోల్‌కతాలో రూ.81.06కు అయింది. దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లోనే డీజిల్ గరిష్ట ధరలు నమోదు చేసింది.


Also Read: Gold Price Today: బులియన్ మార్కెట్‌లో భారీగా పెరిగిన బంగారం ధరలు, రికార్డు స్థాయికి చేరిన Silver Price


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook