SBI: తన ఖాతాదారులకు ఎస్‌బీఐ గుడ్‌ న్యూస్ చెప్పింది. మొబైల్‌ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ బ్యాంకింగ్‌ ద్వారా చేసే మనీ ట్రాన్స్‌ఫర్‌లపై వసూలు చేసే ఎస్ఎంఎస్‌ ఛార్జీలను మాఫీ చేసింది. ఈమేరకు అధికారికంగా ప్రకటనను విడుదల చేసింది. ఇకపై మొబైల్ బ్యాంకింగ్ సేవలను ఉచితం పొందే వీలు ఉంది. దీనిపై ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చక్కటి నిర్ణయం తీసుకున్నారంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈవిషయాన్ని ట్విట్టర్ వేదికగా ఎస్‌బీఐ అధికారులు వెల్లడించారు. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా యూఎస్ఎస్‌డీ సేవలను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. *99# డయల్ చేసి బ్యాంకింగ్‌ సేవలను ఉచితంగా పొందవచ్చని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. మొబైల్ ఫండ్ ట్రాన్స్‌ఫర్‌లపై ఎస్‌ఎమ్ఎస్‌ ఛార్జీలు రద్దు చేయబడ్డాయని..వినియోగదారులు అదనపు ఛార్జీలు లేకుండా సౌకర్యవంతంగా లావాదేవీలు జరుపుకోవచ్చని అధికారులు తెలిపారు. 


యూఎస్‌ఎస్‌డీ సర్వీస్‌ను మొబైల్ ద్వారా పొందవచ్చు. యూఎస్‌ఎస్‌డీని అన్ స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటాగా పిలుస్తారు. దీని ద్వారా మొబైల్‌లో మనీ ట్రాన్స్‌ఫర్, బ్యాంక్ అకౌంట్‌లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, బ్యాంక్ స్టేట్ మెంట్ జనరేట్‌ చేయడంతోపాటు ఇతర సేవలను పొందవచ్చు. ఆన్‌లైన్ సర్వీసులను ఫీచర్ ఫోన్ల ద్వారా ఉపయోగించుకునే వీలు ఉంది. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్‌ లేకుండా బ్యాంకింగ్ సేవలను పొందే అవకాశం ఉంది.  


*99# కోడ్ ద్వారా మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు. స్మార్ట్‌ ఫోన్‌, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఫండ్ ట్రాన్స్‌ఫర్, అకౌంట్‌ స్టేట్‌మెంట్‌తోపాటు ఇతర సేవలను వినియోగించుకోవచ్చు. ఈమేరకు ఖాతాదారులకు ఎస్‌బీఐ అనుమతి ఇచ్చింది.



Also read:T20 World Cup 2022: మెగా టోర్నీకి కౌంట్ డౌన్..యూఏఈ తుది జట్టు ఇదే..!


Also read:Sharad Pawar: ఉత్తర భారతం వల్లే మహిళా రిజర్వేషన్ రావడం లేదు..శరద్ పవార్ హాట్ కామెంట్స్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి