Bengaluru Horror: ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై ఆకృత్యాలు ఆగడం లేదు. దేశం మొత్తం సంచలనం రేపిన ఢిల్లీ చతర్‌పూర్ ఘటన మరువకముందే అంతకంటే కర్కోటకంగా జరిగిన పాశవిక ఘటన వెలుగు చూసింది. సిలికాన్ వ్యాలీ బెంగళూరులో జరిగిన ఈ ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెంగళూరులో జరిగిన అత్యంత పాశవిక ఘటన ఇది. 25 ఏళ్ల అమ్మాయిని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో ఉంచి నిందితుడు పరారయ్యాడు. బెంగళూరులోని వైలిక్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పైప్ లైన్ రోడ్‌లో ఉన్న వీరన్న భవన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇక్కడుండే ఇంట్లో 25 ఏళ్ల మహాలక్ష్మి నివసిస్తోంది. ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కలుండేవాళ్లు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు తీసి లోపలకు వెళ్లగా అసలు విషయం వెలుగు చూసింది. యువతి మృతదేహం దాదాపు 30 ముక్కలుగా ఫ్రిజ్‌లో ఉంది. ఈ హత్య 10-15 రోజుల క్రితం జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. నిందితుడు ఎవరు, అసలేం జరిగింది. మహాలక్ష్మితో వైరమేంటనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. 


గతంలో అంటే రెండేళ్ల క్రితం 2022 మే నెలలో దేశ రాజధాని ఢిల్లీలోని ఛతర్ పూర్‌లో ఇలాంటిదే ఘటన వెలుగు చూసినప్పుడు దేశం మొత్తతం ఉలిక్కిపడింది. తిరిగి అదే తరహాలో బెంగళూరులో ఈ ఘటన జరిగింది. ఢిల్లీలో రెండేళ్ల క్రితం 27 ఏళ్ల శ్రద్ధా వాకర్‌ను ఆమెతో లివ్ ఇన్‌లో ఉన్న ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి మెహ్రౌలీ అడవుల్లో విసిరాడు. ఇంట్లో ఫ్రిజ్‌‌లో కూడా కొన్ని ముక్కలు లభించాయి. 


Also read: Tirumala laddu: చంద్రబాబు చల్లగా ఉండాలి తిరుమల లడ్డూపై వైరల్ అవుతున్న మోహన్ బాబు పోస్ట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.