Love Turns Tragedy: తల్లి చనిపోవడంతో తల్లి లేని బిడ్డ అని ఆ తండ్రి గారాబం చేయడమే పాపమైంది. ప్రేమ, బాధ్యతలు ఉండడంతో కన్న కూతురికి మంచి పెళ్లి సంబంధం కుదుర్చి రెండతస్తుల ఇల్లు రాసిచ్చాడు. త్వరలోనే పెళ్లి చేయాల్సి ఉంది. దీనికోసం పదవీ విరమణ ద్వారా పొందుతున్న డబ్బున్నంతా కుమార్తెకు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అయితే ఆ కూతురు మాత్రం రాక్షాసిగా మారింది. ప్రియుడి మోజులో పడి కన్న తండ్రిని అతి కిరాతకంగా హతమార్చింది. హత్య చేసి మంచంపైన తాపీగా కూర్చోవడం చూస్తుంటే ఆ యువతి ఎంత కర్కషంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సంఘటన ఏపీలోని మదనపల్లెలో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: BS Yediyurappa: లైంగిక వేధింపుల కేసులో మాజీ సీఎం యడియూరప్పకు భారీ షాక్‌.. అరెస్ట్‌ తప్పదా?


 


మదనపల్లెలోని ఎగువ కురవంక ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని పోస్టల్ అండ్ టెలీకామ్ కాలనీలో జీఆర్టీ స్కూల్ టీచర్ దొరస్వామి నివసిస్తున్నాడు. ఆయన భార్య లత ఏడాదిన్నర కిందట మృతి చెందింది. ఉన్న ఒక్కగానొక్క కుమార్తె హరిత (25)ను దొరస్వామి కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఉన్నత చదువులు చదివించి ఆర్థికంగా స్థిరపడేలా ఆయన చేతనైనా సహాయం చేస్తున్నాడు. అంతేకాదు తండ్రి బాధ్యతగా హరితకు మంచి పెళ్లి సంబంధం కుదిర్చాడు. నెల కిందట కుమార్తెకు ఓ పెళ్లి సంబంధం ఖాయం చేశాడు.

Also Read: Dating Scam: పబ్‌కు తీసుకెళ్లి ఫుల్లుగా తాగించి అమ్మాయిల మోసం.. ఏడుగురి ముఠా అరెస్ట్


 


ఆస్తి, ప్రేమ ధారాదత్తం
అనంతరం తన పేరిట ఉన్న రెండు అంతస్తుల ఇంటిని కుమార్తె పేరున రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ నెలలో టీచర్‌గా పదవీ విరమణ పొందుతుండడంతో కుమార్తె పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించాలని సిద్ధమవుతున్నాడు. అయితే కుమార్తె హరిత మాత్రం అప్పటికే ఓ అబ్బాయిని ప్రేమిస్తోంది. ఈ విషయం తండ్రికి చెప్పలేదు. వేరే పెళ్లి నిశ్చయించడంతో తండ్రిపై కోపం పెంచుకుంది. 


ఈ క్రమంలో తండ్రిని హతమారిస్తే ప్రియుడితో హాయిగా గడపాలని హరిత భావించింది. దొరస్వామికి మద్యం అలవాటు ఉంది. రోజూ మద్యం తాగి నిద్రకు ఉపక్రమిస్తుంటారు. దొరస్వామి రోజుమాదిరి బుధవారం రాత్రి కూడా మద్యం తాగి నిద్రపోయారు. తండ్రి గాఢ నిద్రలో ఉన్న సమయంలో కుమార్తె హరిత అత్యంత దారుణంగా తండ్రిని హతమార్చింది. మంచంపై నుంచి కిందపడేసి దారుణ హత్యకు పాల్పడింది. 


ప్రియుడి హస్తం
అయితే తండ్రిని చంపేసిన తర్వాత హరిత మంచంపై హాయిగా కూర్చుంది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలాన్ని డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సీఐలు వల్లిబాష, శేఖర్, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు చేరుకుని పరిశీలన జరిపాయి. ఆధారాలు సేకరించిన అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ హత్య వెనుకాల హరిత ప్రియుడు కూడా ఉన్నాడని తెలుస్తోంది. జరిగిన సంఘటననను పరిశీలిస్తుంటే ప్రియుడితో కలిసి హరిత ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అక్కడి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. హత్య చేసిన అనంతరం హరిత తన ప్రియుడిని పంపించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హరితను అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే నిజనిజాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter