Man Wanted Illegal Affair With his Girlfriend's Daughter Found Dead: వివాహేతర సంబంధాలు ఎంతో కాలం దాగి ఉండవు.. పైగా ఏదో ఒక రోజు ఆ వివాహేతర సంబంధాలే వారి ప్రాణాలపైకి తీసుకొస్తాయి.. అవసరమైతే ప్రాణాలు కూడా తీస్తాయి అని గతంలోనే అనేక సందర్భాల్లో ప్రూవ్ అయిన విషయం తెలిసిందే. పెళ్లయి పిల్లలు ఉన్న ఓ వ్యక్తి తన పక్కింటి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత కొన్నేళ్లుగా ఆ ఇద్దరి మధ్య ఇల్లీగల్ ఎఫైర్ నడుస్తోంది. అంతటితో ఆగని ఆ దుర్మార్గుడు కొత్తగా తన ప్రియురాలి కూతురిపై కూడా కన్నేశాడు. తనతో ఎఫైర్ పెట్టుకున్న మహిళతో పాటు ఆమె 19 ఏళ్ల కుమార్తెని కూడా అనుభవించాలని ఉవ్విళ్లూరాడు. ఆ కామ వాంఛే అతడి ప్రాణాలు పోయేలా తెలిసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలేమైంది.. అతడిని ఎవరు చంపేశారు ?
ఆ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె కూతురిపై కన్నేసిన వ్యక్తి ఉన్నట్టుండి దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటికి 100 మీటర్ల దూరంలోనే ఉన్న పొలాల్లో అతడి శవం లభ్యమైంది. పొలాల్లో మృతదేహం చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. మృతుడి మెడ, మర్మాంగంపై గాయాలు ఉన్నట్టు తేలింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతడిని తీవ్రంగా కొట్టి చంపినట్టు పోస్టుమార్టంలో వెల్లడైంది. 


మృతుడి కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడి గురించి గ్రామంలో ఆరాతీశారు. అతడికి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తులో అతడికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని తేలింది. పోలీసులు ఇక ఆ కోణంలోనే నరుక్కొచ్చారు. ఈ క్రమంలో మరిన్ని విషయాలు పోలీసుల దృష్టికి వచ్చాయి. 


తరచుగా ఆ మహిళ ఇంటికి వెళ్లి వచ్చే క్రమంలో ఆమె కూతురిపై కన్నేశాడు. ఆమె దారిలో వస్తూపోతూ ఉండే క్రమంలో ఆ యువతిని కూడా ఆటపట్టించడం, వేధించడం మొదలుపెట్టాడు. అతడి వైఖరిని తల్లీకూతుళ్లు ఇద్దరూ వ్యతిరేకిస్తూ వచ్చారు. ఎంత నచ్చ చెప్పినా అతడి వైఖరిలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే తల్లీ, కూతురు ఇద్దరూ కలిసి ఓ స్కెచ్ వేశారు. 


ఇంటి వెనుక ద్వారంలోంచి రావాల్సిందిగా ఓ రోజు అతడికి కబురు పంపారు. వాళ్ల ఆహ్వానం అందుకున్న కామాంధుడు.. ఏ మాత్రం వెనుకా ముందు ఆలోచించకుండా ఇక తన చిరకాల కోరిక నెరవేరబోతోంది అన్నట్టుగా హుషారుగా ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడే వాళ్లు అతడిని మాటల్లోపెట్టి బంధించి కర్రలతో విచక్షణారహితంగా కొట్టి చంపారు. శవాన్ని వదిలించుకోవడం కోసం ఇంటికి సమీపంలోనే ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లి పడేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడ సంచలనం సృష్టించింది.