East Godavari Road Accident: తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నల్లజర్ల మండలంలోని అనంతపల్లిలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో కారులోని ఆరుగురు ఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. ఓ మహిళ మార్గమధలో ప్రాణాలు కోల్పోయింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు మహిళలతో పాటు ఓ చిన్నారి ఉంది. కారులో విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తుండగా.. హైవేపై ఘటన చోటు చేసుకుంది. మరో వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోమవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘోర దుర్ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం.. అతి వేగమే ప్రమాదానికి కారణమైనట్లు సమాచారం. ఆగి ఉన్న లారీని వెనుకవైపు నుంచి కారు బలంగా ఢీకొట్టడంతో నుజ్జునుజ్జు అయింది. ఏకంగా లారీ కిందకు కారు దూసుకెళ్లింది. ఆ ప్రాంతం అంతా రక్తసిక్తమైంది. ఓ శుభకార్యం కోసం వీరంతా విజయవాడ నుంచి రాజమండ్రికి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుల బంధువులకు సమాచారం అందజేశారు.  


Also Read: Novak Djokovic: గర్జించిన సెర్బియా సింహం.. జకోవిచ్ దెబ్బకు తలవంచిన రికార్డులు  


Also Read: Jagananna Vidya Kanuka: నేడే జగనన్న విద్యాకానుక పంపిణీ.. ఒక్కో విద్యార్థికి రూ.2,400 ఖర్చు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి