Wife And Son Killed A man In Delhi Pandav Nagar Area and chopped his body: ఢిల్లీలోని మెహ్రౌలీలో శ్రద్ధా వాకర్ అనే యువతిని హత్య చేసి ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి రిఫ్రిజిరేటర్‌లో దాచి అక్కడక్కడా పడేసిన ఘటన తరహాలోనే ఢిల్లీ పోలీసులు అలాంటి మరో కేసును ఛేదించడంలో విజయం సాధించారు. తూర్పు ఢిల్లీలో దొరికిన మానవ శరీర భాగాల మిస్టరీని ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ ఛేదించింది. పాండవ్ నగర్‌లో నివసిస్తున్న ఒక వ్యక్తి మృతదేహాన్ని ఓ ఇంట్లో ముక్కలు ముక్కలు చేసి ఫ్రీజ్‌లో ఉంచారు. ఆ తర్వాత పాండవ్ నగర్ సహా తూర్పు ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో మృతదేహం ముక్కలను ప్రతిరోజూ విసిరివేసేవారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ దారుణమైన హత్య ఘటనను ఒక మహిళా, ఆమె కుమారుడు కలిసి చేశారు. ఈ ఇద్దరు నిందితులు మృతదేహాన్ని ముక్కలుగా నరికి వారి ఇంట్లో ఫ్రిజ్‌లో ఉంచి, ఆపై పాండవ్ నగర్ ప్రాంతంలో విసిరేవారు. నిందితులయిన ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  తూర్పు ఢిల్లీలోని త్రిలోక్‌పురి ప్రాంతం పాండవ్ నగర్‌లోని ఒక మైదానం నుండి మానవ శరీరంలోని కొన్ని భాగాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న శరీర భాగాలు హత్యకు గురైన వ్యక్తికి చెందినవని గుర్తించారు. అరెస్టయిన నిందితుల పేర్లు పూనమ్, దీపక్. ఈ అవయవాలు పూనమ్ భర్త అంజన్ దాస్‌కు చెందినవని దర్యాప్తులో తేలింది.


నిజానికి, నిందితుడు పూనమ్ అంజన్ దాస్ భార్య అయితే, దీపక్ అతనికి సవతి కొడుకు. అంజన్‌ను హత్య చేసినట్లు ఇద్దరూ అంగీకరించారు. అంజన్ దాస్ చాలా మంది మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని అంజన్ దాస్ తన సవతి కొడుకు దీపక్ భార్యపై కూడా తప్పుడు ఉద్దేశంతో ఉన్నాడని అందుకే అతన్ని మట్టుబెట్టామని వారు ఒప్పుకున్నారు. దీపక్ నిజానికి పూనమ్ మొదటి భర్త కల్లు కొడుకు. తన సవతి తండ్రి అంజన్ దాస్ తన భార్యపై తప్పుడు దృష్టి పెట్టాడని దీపక్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి తల్లి దృష్టికి తీసుకు వెళ్లడంతో ఇద్దరూ కలిసి చంపినట్టు తేలింది. ముందుగా మత్తు మాత్రలు కలిపి మద్యం తాగించి, ఆ తర్వాత కత్తితో మృతదేహాన్ని ముక్కలుగా చేసి పలుచోట్ల విసిరారని పోలీసులు చెబుతున్నారు.


సమాచారం ప్రకారం పూనమ్  కూడా చాలా పెళ్లిళ్లు చేసుకుంది. గత మే 30న పోలీసులకు ఈ మానవ అవయవాలు లభ్యమయ్యాయి. ఈ కేసులో, పోలీసులకు కొన్ని సిసిటివి ఫుటేజీలు అందాయి, దాని ఆధారంగా ఆరు నెలల విచారణ తర్వాత ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఇప్పుడు పోలీసులు అంజన్ దాస్ డీఎన్ఏ ప్రొఫైలింగ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఈ కేసు కూడా ఢిల్లీలోని ఛతర్‌పూర్ ప్రాంతంలో జరిగిన శ్రద్ధా హత్య కేసును పోలి ఉంటుంది. అలాగే రెండు హత్యలూ మే నెలలోనే జరగడం యాదృచ్ఛికం. ఛతర్‌పూర్ ప్రాంతంలోని అద్దెకు ఉన్న ఫ్లాట్‌లో నివసిస్తున్న అఫ్తాబ్, తన లివింగ్ రిలేషన్ షిప్ పార్ట్నర్ శ్రద్ధా వాకర్‌ను హత్య చేసి, ఆమె శరీరాన్ని సుమారు 35 ముక్కలుగా నరికి చంపాడు. ఆ తర్వాత మృతదేహం ముక్కలను ఫ్రిజ్‌లో ఉంచి.. నెలల తరబడి రాత్రిళ్లు వాటిని అడవిలో పారవేస్తూ వచ్చాడు. 


Also Read: Prabhas Love : ప్రభాస్ మనుసులో కృతి.. అసలు విషయం లీక్ చేసేసిన వరుణ్ ధావన్!  


Also Read: Shruti Haasan without Makeup : మేకప్ లేకపోతో ఇలా ఉంటుందా?.. శ్రుతి హాసన్‌ అలా అయిపోవడానికి కారణాలివేనట



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook