టాలీవుడ్‌లో పేరుమోసిన సినిమాటోగ్రాఫర్ ఛోటా.కె.నాయుడు తమ్ముడు శ్యామ్.కె.నాయుడు (Shyam K Naidu ) తనను మోసం చేశారంటూ మొదలైన సినీనటి శ్రీసుధ అలియాస్ సాయిసుధ (Actress Sai Sudha) ఫిర్యాదు చేసిన కేసు మలుపులు తిరుగుతోంది. తాజాగా నటి సాయి సుధ ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. ఎస్ఆర్ నగర్ సీఐ మురళీకృష్ణపై తాను చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలను నటి (Sai Sudha) సమర్పించారు. శ్యామ్ కె నాయుడుపై సినీ ఆర్టిస్ట్ ఫిర్యాదు, అరెస్ట్ !


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్యామ్ కే నాయుడు తనను మోసం చేశాడంటూ ఇచ్చిన ఫిర్యాదు విషయంలో సాయం చేసేందుకు తన వద్ద నుంచి రూ.5 లక్షల వరకు సీఐ వసూలు చేశారని ఇదివరకే సాయిసుధ ఆరోపించారు. కేసు దర్యాప్తులో సాయం చేయకపోగా శ్యామ్ కే నాయుడుకు సహకరించారని, ఈ క్రమంలో నకిలీ పత్రాలు  సృష్టించారని ఆమె చెబుతున్నారు.  Pics: అందాల ఊర్వశివే.. గుండెల్లో గుచ్చావే.. 


తన వద్ద ఉన్న ఆధారాలు సమర్పించేందుకు ఏసీబీ కార్యాలయానికి వచ్చినట్లు నటి సాయిసుధ తెలిపారు. సీఐ మురళీకృష్ణ తన వద్ద నంచి డబ్బులు వసూలు చేయడం, ఫోన్‌లో మాట్లాడిన సాక్ష్యాలను సమర్పించినట్లు వివరించారు. కాగా, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడంటూ ఆర్టిస్ట్ సాయి సుధ (Sai Sudha) గతంలో ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోకిరి లేడీ విలన్ Sheeva Rana Hot Photos వైరల్   
నితిన్, షాలిని పెళ్లి వేడుక ఫొటోలు