కరోనా వైరస్ మరోసారి భారత్‌లో తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్పటికే దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు 90 వేలకు చేరుకుంటున్నాయి. పలువురు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కరోనా బారిన పడ్డాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనకు కోవిడ్-19 పాజిటివ్ అని సోషల్ మీడియా ద్వారా అక్షయ్ కుమార్ వెల్లడించాడు. ఈరోజు ఉదయం నాకు కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. కోవిడ్19 నిబంధనల ప్రకారం నేను ఐసోలేషన్‌కు వెళ్లాను. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను నేరుగా కలిసిన వారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నేను త్వరలోనే కోలుకుని యాక్షన్‌లోకి దిగుతానంటూ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్(Akshay Kumar) ట్వీట్‌లో పేర్కొన్నారు.


Also Read: COVID-19 Positive Cases: తెలంగాణలో కరోనా కలకలం, ఒక్కరోజే 1321 కోవిడ్-19 పాజిటివ్ కేసులు



అక్షయ్ కుమార్ ఇటీవల రామ్ సేతు మూవీ షూటింగ్‌లో పాల్గొన్నారు. షూటింగ్ కొనసాగిస్తుండగా ఆయనకు కరోనా సోకింది. అక్షయ్‌కి కరోనా సోకడంపై బాలీవుడ్ నటి డయానా పెంటీ స్పందించింది. మీరు త్వరగా కోలుకోవాలి సార్ అని ఆకాంక్షించింది. ఇటీవల హోలీ వేడుకలు సైతం జరుపుకోవద్దని, కరోనా కేసులు పెరుగుతున్నాయని అక్షయ్ కుమార్ తన అభిమానులను కోరడం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనే కోవిడ్-19(COVID-19) బారిన పడ్డారు.


Also Read: COVID-19 Vaccine: ఆస్ట్రాజెనెకా టీకా తీసుకుని రక్తం గడ్డకట్టడంతో ఏడుగురు మృతి 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook