అల్లు అర్జున్ చేతుల మీదుగా గీత గోవిందం ఆడియో లాంచ్ కానుంది. అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు ఫేమ్ విజయ్ దేవరకొండ, కన్నడ నటి రష్మిక మందన జంటగా నటించిన గీత గోవిందం సినిమా ఆడియో ఈ నెల 29న హైదరాబాద్ లోని జేఆర్ఎసీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా లాంచ్ కానుండగా ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు తాజాగా ఆ మూవీ యూనిట్ స్పష్టంచేసింది. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ఇప్పటికే మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇటీవలే రిలీజైన ఈ సినిమా టీజర్ కి భారీ స్పందన లభించింది. దీనికి తోడు గోపీ సుందర్ అందించిన ట్యూన్స్ లోంచి ఇంకేం ఇంకేం కావాలి పాట ఇప్పటికే హాట్ బీట్స్ లో టాప్ పొజిషన్ దక్కించుకుంది. మరోవైపు విజయ్ దేవరకొండ పాడిన వాట్ ది ఎఫ్ సాంగ్ సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా అభిమానుల ముందుకు రానుంది.