Anasuya: అనసూయ తన యాక్టింగ్ పరంగానే కాదు సోషల్ మీడియాలో వివాదాల వల్ల కూడా ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు మరోసారి అనసూయ.. సావిత్రి అమ్మ వల్ల కాంట్రవర్సీలో ఇరుక్కోవడం అందరి దృష్టిని తనవైపు మళ్లించుకుంది. తాజాగా అనసూయ ఓ తెలుగు ఛానెల్ ఏర్పాటు చేసిన అవార్డుల వేడుకలో పాల్గొన్నారు. ఇందులో అనసూయ పలు హీరోయిన్లను ఇమిటేట్ చేస్తూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చేసింది. అలనాటి తారలు సావిత్రి, జమున, శ్రీదేవి, సౌందర్య నటించిన పాటలను అనసూయ రీ క్రియేట్‌ చేసి వారి గెటప్స్ తో డ్యాన్స్ చేసింది. ఇక ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అంతేకాదు అనసూయనే స్వయంగా ఆ ఫోటోలను షేర్ చేస్తూ 'నా డ్యాన్స్ పెర్ఫామెన్స్‌ తో దిగ్గజ తారలకు నివాళి అర్పించే అవకాశం వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్న' అంటూ ట్వీట్ చేశారు. కాగా ఈ పోస్టు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగానే, ఇక ఎప్పటిలానే ఈ పోస్ట్ కింద అనసూయ అంతే పడినివారు రకరకాలుగా కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఒక అతను అయితే ఏకంగా సావిత్రిలా నటించడం అంటే ఎక్స్‌పోజింగ్ చేేేసినంత ఈజీ కాదని ట్వీట్ చేశాడు. ఇక ఆ ట్వీట్ కి తనదైన స్టైల్ లో స్పందించింది అనసూయ. 'నిజం చెప్పారండీ.. సావిత్రమ్మలా నటించడం చేయటం ఎవరి తరం కాదు. నేను కేవలం వారికి నివాళిగా ప్రదర్శన ఇచ్చాను. అంతేకాదు, ఎక్స్‌ పోజింగ్ చేయడం అనేది కూడా ఈజీ కాదు. ఫిజికల్ గా, ఎమోషనల్ గా చాలా ప్రిపేర్ కావాలి. ఏ పాత్ర చేసినా, ఏ దుస్తులు ధరించినా మన పనిని దృఢ సంకల్పంతో చెయ్యాలి' అని రిప్లై పెట్టింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇక అనసూయ ఇచ్చిన ఈ రిప్లై ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.


Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి