August Tragedies to NTR Family: ప్రముఖ సినీ నటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుటుంబం మరో సారి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆయన నలుగురు కుమార్తెలలో చిన్న కుమార్తె అయిన ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడంతో ఎన్టీఆర్ కుటుంబంతో పాటు ఆయన అభిమానుల్లో కూడా తీవ్ర విషాదం నెలకొన్నట్లు అయింది. ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం సమయంలో బలవన్మరణానికి పాల్పడినట్లు మీడియాకు సమాచారం అందింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొన్నాళ్లుగా అనారోగ్య కారణాలతో పాటు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె తన గదిలోనే చున్నీతో ఉరి వేసుకున్నట్లు ఆమె చిన్న కుమార్తె దీక్షిత చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత తమ బంధువులు అయిన చంద్రబాబు బాలకృష్ణ వంటి వారికి సమాచారం ఇవ్వడంతో ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిన వారందరూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబానికి ఆగస్టు నెల అచ్చి రాలేదు అంటూ కొంతమంది కామెంట్లు చేయడం కనిపిస్తుంది.


నిజానికి ఎన్టీఆర్ కు 12 మంది సంతానం ఆ 12 మందిలో కూడా రామకృష్ణ అనే ఆయన చిన్న వయసులోనే ఒక నయం కాని జబ్బుతో మరణించారు. ఆయన మీద చాలా ప్రేమ పెట్టుకున్న ఎన్టీఆర్ తరువాత ఏడవ సంతానానికి జూనియర్ రామకృష్ణ అని పేరు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ కంటే ముందే రామకృష్ణ మరణించగా ఎన్టీఆర్ చనిపోయిన ఎనిమిదేళ్లకు ఆయన కుమారులలో మూడో కుమారుడైన సాయి కృష్ణ కూడా మరణించారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు సమాచారం.


ఇక ఎన్టీఆర్ నాలుగో కుమారుడు హరికృష్ణ సరిగ్గా మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆగస్టు 29వ తేదీన నెల్లూరులో ఒక పెళ్లికి బయలుదేరిన ఆయన నల్గొండ సమీపంలో వాహనం ప్రమాదానికి గురై కన్నుమూశారు. ఈ ఘటనలో హరికృష్ణ హాస్పిటల్ కి తీసుకువెళ్లిన తర్వాత ఆయనను కాపాడ లేక పోయారు. ఆయన కంటే ముందే ఆయన పెద్ద కుమారుడు జానకిరామ్ కూడా సరిగ్గా అలాగే రోడ్డు ప్రమాదంలో మరణించడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఎన్టీఆర్ నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని మరణించడం కూడా హాట్ టాపిక్ అయింది.


నిజానికి తెలుగుదేశం పార్టీ ఆగస్టు సంక్షోభం వల్ల ఎంత ఇబ్బంది పడిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆగస్టు నెలలోనే హరికృష్ణ సహా ఉమామహేశ్వరి కూడా కన్నుమూయడంతో పార్టీకి మాత్రమే కాదు ఎన్టీఆర్ కుటుంబానికి కూడా ఆగస్టు నెల కలిసి రావడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాక ఆ కుటుంబానికి రోడ్డు ప్రమాదాలు జరిగి చనిపోతూ ఉంటారనే పేరు కూడా ఉంది. ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య చౌదరి, హరికృష్ణ, జానకిరామ్ రోడ్డు ప్రమాదాల కారణంగానే మరణించారు. ఇప్పుడు ఆగస్టు నెలలోనే ఉమామహేశ్వరి చనిపోవడంతో ఈ అంశం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.


Also Read: Anbu Chezliyan: ప్రముఖ నిర్మాతపై ఐటీ రైడ్స్.. తమిళ పరిశ్రమలో కలకలం!


Also Read: Uma Maheshwari Cremation Updates: ఉమా మహేశ్వరి అంత్యక్రియలకు తారక్ రావడం లేదా ?



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook