Manchu Family Clashes: తెలుగు సినీ పరిశ్రమలో కీలకమైన మంచు కుటుంబం తారస్థాయిలో విబేధాలు ఉన్నట్లు తెలుస్తోంది. మంచు మోహన్‌ బాబు కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని సమాచారం. ముఖ్యంగా తండ్రీకొడుకులు మోహన్‌ బాబు, మనోజ్‌కు ఇద్దరికీ పడడం లేదని చర్చ జరుగుతోంది. దీనికి నిదర్శనంగా తాజాగా జరిగిన ఓ శుభకార్యం ఉదాహరణగా నిలుస్తోంది. మంచు మనోజ్‌ కుమార్తెకు అన్నప్రాసన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగ్గా ఈ వేడుకకు మోహన్‌ బాబు డుమ్మా కొట్టారు. అంతేకాకుండా విష్ణు కూడా రాలేదు. దీంతో తండ్రీ కొడుకులు, అన్నదమ్ముళ్ల మధ్య కొన్ని విషయాల్లో గొడవలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: NTR Emotional: పోలీస్‌ లాఠీచార్జ్‌పై ఎన్టీఆర్‌ భావోద్వేగం.. ఫ్యాన్స్ కాలరేగరేసేలా చేస్తా


రెండో పెళ్లి చేసుకున్న మంచు మనోజ్‌, భూమ అఖిలప్రియకు కొన్ని నెలల కిందట పాప జన్మించిన విషయం తెలిసిందే. ఆ పాపకు దేవసేన అని నామకరణం చేశారు. తాజాగా హైదరాబాద్‌లోని మనోజ్‌ అక్క మంచు లక్ష్మీ ప్రసన్న నివాసంలో మనోజ్‌ పాపకు సంబంధించిన అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని లక్ష్మీ ప్రసన్న దగ్గరుండి కార్యక్రమాన్ని చేపట్టారు. అతిథులకు స్వాగతం పలకడం.. అందరికీ మర్యాదలు చేయడం వంటి లక్ష్మక్క చేసింది.

Also Read: Devara Pre Release: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌పై విరిగిన లాఠీ.. దేవర ప్రి రిలీజ్‌ వేడుక రద్దు


ఈ వేడుకకు మనోజ్‌ తల్లి నిర్మలతోపాటు సినీ పరిశ్రమ నుంచి కొందరు ప్రముఖులతోపాటు బంధుమిత్రులు హాజరయ్యారు. అన్నప్రాసనలో పాప మొదట డబ్బు, రెండోసారి పుస్తకం, మూడోసారి బంగారు ఆభరణం పట్టుకుంది. దీంతో అందరూ కేరింతలు కొట్టారు. ఈ అన్నప్రాసన కార్యక్రమానికి సంబంధించిన వీడియోను లక్ష్మీ ప్రసన్న తన యూట్యూ్‌లో చానల్‌లో పంచుకుంది. ఈ వీడియో మొత్తంలో కూడా తండ్రి మోహన్‌ బాబు, మంచు విష్ణు కుటుంబం కనిపించలేదు. వారు ఈ వేడుకకు గైర్హాజరయ్యారని తెలుస్తోంది.


వాస్తవంగా మనోజ్‌ రెండో పెళ్లికి మోహన్‌ బాబు అంగీకరించలేదని సమాచారం. అఖిలప్రియతో మనోజ్‌ వివాహాన్ని లక్ష్మీప్రసన్న దగ్గరుండి చేయించారు. తండ్రి, సోదరుడు విష్ణుతో విబేధాలు ఏర్పడడంతో మంచు మనోజ్‌ ఒంటరిగా మారాడు. అయితే చిన్నప్పటి కొడుకులా మనోజ్‌ను చూసుకుంటున్న లక్ష్మీప్రసన్న ఈ సమయంలో మనోజ్‌కు తల్లిలాగా మారారు. అతడి జీవితంలో ఏర్పడిన విషాదాన్ని తొలగించి అఖిలప్రియతో అంగరంగ వైభవంగా లక్ష్మీప్రసన్న పెళ్లి జరిపించారు. 


పెళ్లి తర్వాత కూడా మనోజ్‌కు లక్ష్మీ అన్నీ చూసుకుంటున్నారు. శ్రీమంతం, ప్రసవం.. ఊయల ఇలా మనోజ్‌ కుటుంబంలో లక్ష్మీప్రసన్న చూసుకున్నారు. ఈ క్రమంలో అన్నప్రాసన కార్యక్రమాన్ని అత్త హోదాలో లక్ష్మీప్రసన్న అన్నీ నడిపించారు. ఈ వేడుకకు మోహన్‌ బాబు, విష్ణు రాకపోవడంతో మంచు కుటుంబం రెండుగా చీలినట్టు కనిపిస్తోంది. మోహన్‌ బాబు, విష్ణు ఒకవైపు.. మనోజ్‌, లక్ష్మీప్రసన్న ఒకవైపుగా ఉన్నట్టు తెలుస్తోంది. కొన్నాళ్లుగా వీరి మధ్య ఉన్న విభేదాలు తాజాగా అన్నప్రాసన వేడుకకు హాజరు కాకపోవడంతో తీవ్రస్థాయిలో ఉన్నట్లు సమాచారం.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.