బాలీవుడ్ ఇండస్ట్రీ ( Bollywood industry ) లో కలకలం రేపుతున్న డ్రగ్స్ వాడకం ( Drugs ) వ్యవహారం ఆమె చేసిన వ్యాఖ్యలతో మరింత వివాదాస్పదమైంది. క్రికెటర్ల భార్యలు డ్రగ్స్ మత్తులో ఉన్నారంటూ ఆ  హాట్ బ్యూటీ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant singh rajput ) మరణ వ్యవహారం చివరికి ముంబై డ్రగ్స్ కేసు ( Mumbai Drugs case ) గా మారి..బాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని చాటిచెప్పింది. ఈ కేసులో బయటికొస్తున్న పేర్లతో కలకలం రేగుతోంది. తీగలాగింతే డొంకంతా కదిలినట్టు డ్రగ్స్ వాడుతున్న సెలెబ్రిటీల సంఖ్య పెరుగుతోంది. సరిగ్గా ఈ సమయంలో హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రా ( Hot Beauty Sherlyn Chopra ) చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదమవుతున్నాయి. ఈసారి ఈమె చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచం ఉలిక్కిపడేలా చేశాయి. 


షెర్లిన్ చోప్రా మాటల్లోనే


కేకేఎల్ మ్యాచ్ చూడటానికి గతంలో ఓసారి కోల్ కత్తా వెళ్లాను. ఆట అయిపోయింది. పార్టీకు నన్ను ఆహ్వానించారు. ఈ పార్టీకు ప్రముఖ క్రికెటర్ల భార్యలు కూడా హాజరయ్యారు. పార్టీలో బాగా ఎంజాయ్ చేశాను. కాస్సేపటికి అలసిపోయి వాష్ రూమ్ కు వెళ్లాను. అక్కడ నేను చూసిన దృశ్యం షాక్ కి గురిచేసింది. క్రికెటర్లు, స్టార్ క్రికెటర్ల భార్యలు కూడా వాష్‌రూమ్ ప్రాంతంలో కొకైన్ కొట్టేవారు. నన్ను చూసి నవ్వారు. నేను కూడా నవ్వాను. ఇక తప్పుడు ప్రదేశంలో ఉన్నానని అనుకున్నాను. అక్కడ వాతావరణం నచ్చక వెంటనే బయటికి వచ్చేశాను. అలాంటి డ్రగ్ పార్టీలు ఒకదాని తరువాత ఒకటి జరుగుతూనే ఉండేవి..


షెర్లిన్ చోప్రా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చాలా వివాదాన్ని రేపుతున్నాయి. షెర్లిన్ చోప్రా వ్యాఖ్యలకు కొందమంది నెటిజన్లు మద్దుతు తెలుపగా..మరి కొంతమంది తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలిపారు. అవకాశాలు లేనంత మాత్రాన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే క్రేజ్ పెరుగుతుందనుకోవడం అవివేకమేని కామెంట్లు చేశారు ఇంకొంతమంది. Also read: Ram Charan: ఆ విషయంలో చెర్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాజమౌళి! ఎందుకో తెలుసా ?