కరోనావైరస్ పుట్టి సంవత్సరం దాటినా.. ఇంకా దాని పర్యావసానాలు మాత్రం ప్రపంచాన్ని ఒణికిస్తూనే ఉన్నాయి. ఆ రంగం, ఈ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాలను కరోనా పలకరించింది. అలాగే తెలుగు సినీ పరిశ్రమ సైతం కరోనాకు అతీతమే కాదని ఇప్పటికే అనేక కేసులతో ప్రూవ్ అయింది. ఇటీవల క్రిస్మస్ వేడుకల అనంతరం రాంచరణ్, వరుణ్ తేజ్‌లకు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"203497","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"pawan-kalyan-krish-movie-PSPK-27","field_file_image_title_text[und][0][value]":"పీఎస్‌పీకే 27 మూవీ"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"pawan-kalyan-krish-movie-PSPK-27","field_file_image_title_text[und][0][value]":"పీఎస్‌పీకే 27 మూవీ"}},"link_text":false,"attributes":{"alt":"pawan-kalyan-krish-movie-PSPK-27","title":"పీఎస్‌పీకే 27 మూవీ","class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇదిలావుండగా తాజాగా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడికి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం క్రిష్ హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. ఇక ప్రస్తుతం క్రిష్ చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. క్రిష్‌ ప్రస్తుతం పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ( Pawan Kalyan ) ప్రధాన పాత్రలో ఓ సినిమా చేస్తున్నాడు. షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ జనవరి 4న తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది కానీ ఇంతలోనే క్రిష్ ( Director Krish ) కరోనా బారిన పడిన నేపథ్యంలో సినిమా షూటింగ్‌కి కూడా తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి.