ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన టాలీవుడ్ నటుడు డాక్టర్ రాజశేఖర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని సిటీన్యూరో సెంటర్ మెడికల్ డైరెక్టర్ డా. రత్నకుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వైద్యానికి రాజశేఖర్ స్పందిస్తున్నారని చెప్పారు. నటుడు రాజశేఖర్ ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగవుతోందని ప్రస్తుతానికి ఆందోళన అక్కర్లేదన్నారు.



 


రాజశేఖర్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. హై ఫ్లో ఆక్సిజన్ సేవలు అందిస్తూ రాజశేఖర్‌కు చికిత్స చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల రాజశేఖర్ ఆయన భార్య నటి జీవిత, కుమార్తెలు ఇద్దరూ కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే వీరి కూతుళ్లు త్వరగానే కోవిడ్19 బారి నుంచి కోలుకున్నారు. రాజశేఖర్, జీవిత దంతపులు సిటీన్యూరో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.



 


కాగా, చికిత్స అనంతరం కరోనా నెగటివ్ రావడంతో జీవిత డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాజశేఖర్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజశేఖర్ ఆరోగ్యం మెరుగవుతుందని తాజా హెల్త్ బులెటిన్‌లో వైద్యులు వెల్లడించారు. తన తండ్రి కరోనాతో పోరాడుతున్నారని, అందరూ ప్రార్థించాలని ఆయన కూతురు శివాత్మిక ఇటీవల ట్వీట్ చేసి సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను, అభిమానులను కోరారు. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe