Evaru Meelo Koteeswarulu: ఆర్ఆర్ఆర్(RRR) సినిమా కంటే ముందే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మనల్ని అలరించనున్నాడు. కేవలం ఒక్కరోజు కాదు.. సోమవారం నుంచి గురువారం వరకు ఇక మిమ్మల్ని అలరించనున్నాడు. యంగ్ టైగర్ హోస్ట్‏గా 'ఎవరు మీలో కోటీశ్వరులు' కార్యక్రమం ఆగస్టు 22 నుంచి ప్రసారం కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలి ఎపిసోడ్‌కు అతిథిగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌(Ram Charan) విచ్చేసి సందడి చేశారు. ఎన్టీఆర్‌(jr ntr) ఈ విషయాన్ని ట్విటర్‌(Twitter) వేదికగా పంచుకుంటూ.. ‘‘ఈనెల 22న ‘ఎవరు మీలో కోటీశ్వరులు(Evaru Meelo Koteeswarulu)’ ద్వారా మీ ఇంటిలో సందడి చేయబోతున్నాం. సోదరుడు రామ్‌చరణ్‌తో కలిసి చేసిన ఈ కర్టెన్‌ రైజర్‌ మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నా’’ అని ట్వీట్‌ చేశారు.


Also Read: Paagal Movie Review: విశ్వక్ సేన్ "పాగల్ " సినిమా రివ్యూ


ఇక షోలోకి  చెర్రీ ఎంట్రీ ఇచ్చి, హోస్ట్‌సీట్‌(hot Seat)లో కూర్చోబోయారు. వెంటనే అడ్డుపడిన ఎన్టీఆర్‌.. అది హాట్‌ సీటు‌.. ఇది హోస్ట్‌ సీటు అని చెప్పడంతో చరణ్‌ వెళ్లి హాట్‌ సీటులో కూర్చొన్నారు. అనంతరం ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. చివరకు ఎన్టీఆర్‌(NTR) వేసిన ప్రశ్న విన్న తర్వాత ‘సీటు హీట్‌ ఎక్కుతోంది.. బ్రెయిన్‌ హీట్‌ ఎక్కుతోంది’  అంటూ చరణ్‌(Ram Charan) సమాధానం ఇవ్వడం చూస్తుంటే ఈ ఎపిసోడ్‌ కేక పుట్టించేలా ఉందనిపిస్తోంది.  మరి పూర్తి ఎపిసోడ్‌ చూడాలంటే ఆగస్టు 22వ తేదీ రాత్రి 8.30గం.ల వరకూ వేచి చూడాల్సిందే. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook