Abhinaya Mother Passed Away: నటి అభినయ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి మరణించారు. రిక్షాలో ప్రయాణిస్తూ ఊహించని విధంగా మరణించారు. ఈ విషయాన్ని అభినయం ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఆగస్టు 17వ తేదీన ఇదంతా జరిగినట్లు చెప్పారు. జరిగిన విషయాన్ని చెప్పుకుంటూ నటి ఎమోషనల్ అయ్యారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ప్రముఖ నటి అభినయ అందరికీ సుపరిచితమే. తమిళనాడుకు చెందిన ఆమె పుట్టుకతోనే బధిర. మాట్లాడలేదు..ఆమెకు వినపడదు. అయినా కూడా తన నటనతో సినిమాల్లో రాణిస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు  మూవీలో నటించారు. ఈ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నారు అభినయ. శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, నేనింతే, కింగ్, రాజుగారి గది 2 వంటి సినిమాల్లో నటించారు. 


Also Read : EPS 95 Pension:  EPS-95 పెన్షన్ సభ్యులకు గుడ్ న్యూస్.. త్వరలోనే హయ్యర్ పెన్షన్ అమలు జరిగే చాన్స్.. కొలిక్కి వస్తున్న చర్చలు


అభినయ ఇన్ స్టాగ్రామ్ లో ఈ విధంగా పోస్టు చేశారు:


అమ్మ నువ్వు లేవనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను. మీరు ఆకస్మాత్తుగా మిమ్మల్ని వదిలేసి ఈ లోకాన్ని విడిచివెళ్లిపోతారనుకోలేదు. తాతలానే నువ్వు కూడా ఇలా రిక్షాలోనే మరణించారు. తండ్రి కూతురు ఇద్దరు ఇలా ఒకేలా మరణించడం ఎంత యాధ్ధ్రుచ్చికమో కదా. నువ్వు లేకుంటే నేను ఇంత సాధించేదాన్ని కదా. ప్రతి విషయంలోనూ నన్ను ముందుండి నడిపించారు. ఇప్పుడు నీ బాధ్యతను సాయిసునందన్ తీసుకుంటాడు. జన్మ ఉంటే మళ్లీ నీ కూతురుగానే పుట్టాలని కోరుకుంటున్నాను అమ్మ. రెస్ట్ ఫరెవర్ అమ్మ అంటూ భావోద్వేగంతో రాసారు అభినయ. 


Also Read : Kitchen Hacks:  శ్రావణ మాసంలో కొట్టిన కొబ్బరి కాయలు మిగిలిపోయాయా.. ఇలా వాడి చూడండి  




 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.