Harsha Sai: ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై ఓ యువతి హైదరాబాద్ లోని నార్సింగ్  పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. రీసెంట్ గా జానీ మాస్టర్ .. దారుణ ఉదంతం మరవక ముందే మరో ఘటన జరగడం సంచలనం రేపుతుంది. ఈ నేపథ్యంలో సదురు యువతి .. హర్ష సాయి తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది. రూ. 2 కోట్లు  తీసుకుని వాడుకున్నాడని కంప్లైంట్ చేసింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసులు అతడిపై 328, 376 ,354 సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అడ్వకేట్‌తో కలిసి నార్సింగి పీఎస్‌కి వచ్చి బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనపై హర్ష సాయి పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డ విషయాన్ని ప్రస్తావించింది. అంతేకాదు తనపై లైంగిక దాడి జరుపుతూనే.. తన నగ్న చిత్రాలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడంటూ బాధితురాలు తన కంప్లైంట్ లో పేర్కొంది.


ఈ విషయంలో హర్షసాయి తండ్రి రాధాకృష్ణ ప్రమేయం కూడా ఉందని చెబుతుంది సదరు యుతి. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసారు. హర్ష సాయికి యూట్యూబ్‌లో 10 మిలియన్లకు పైగా సబ్‌స్కైబర్లు ఉన్నారు. పేదలకు సాయం చేస్తూ వీడియోలు తీసుకుని వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తుంటాడు. పేదలకు హర్ష సాయి డబ్బులు పంచే వ్యవహారం అంతా ఫేక్ అనే వారు లేరు. మొత్తంగా హర్ష సాయిపై కేసు నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!


ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.